బీసీ సీఎం ప్రకటన చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.
నవంబర్ 3వ తేదీ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీకి మాత్రమే దక్కుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.
అయితే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.