తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా కసరత్తు చేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ తెలంగాణభవన్ వేదికగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించారు.
మ్యానిఫెస్టోలో అంశాలు: – రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ
– రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా పథకం
– జూన్ నుంచి అమల్లోకి కేసీఆర్ బీమా – తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో సన్నబియ్యం – సౌభాగ్యలక్ష్మీ పేరుతో అర్హులైన పేద మహిళలకు రూ.3 వేల గౌరవ భృతి – అర్హులైన లబ్ధిదారులకు, జర్నలిస్టులకు రూ.400 కే గ్యాస్ సిలిండర్ – రైతుబంధు రూ.16 వేల వరకూ పెంపు – కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో హెల్త్ స్కీమ్ – ఆరోగ్య శ్రీ పరిధిల రూ.15 లక్షలకు పెంపు – హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు – అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ – మహిళా సంఘాలకు భవనాలు నిర్మాణం – అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ – ఓపీఎస్ డిమాండ్ పై కమిటీ నియామకం – దశల వారీగా ఆసరా పెన్షన్ల పెంపు – దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు – ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు – అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత, అన్ని హక్కులు
.