ఏపీలోని ప్రజలు అంతా చంద్రబాబు వైపే చూస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.చంద్రబాబుకు మద్ధతుగా తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ కోసం తెలంగాణ పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహమని దేవినేని ఉమ ప్రశ్నించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు దగ్గర మంత్రిగా పని చేసిన వారేనని తెలిపారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని దేవినేని ఉమ ధీమా వ్యక్తం చేశారు.







