మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల ఆ పార్టీలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని పొన్నాల రాజీనామా లేఖలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.దీంతో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ మంత్రి కేటీఆర్ పొన్నాలను కలవనున్నారని సమాచారం.ఈ నేపథ్యంలోనే పొన్నాల ఒకవేళ బీఆర్ఎస్ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల నేపథ్యంలో పొన్నాల కారు ఎక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.







