చలికాలం వచ్చిందంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ప్రారంభించాలని చెబుతూ ఉంటారు.ఎందుకంటే గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవడం వలన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
అలాగే శరీరంలో ఉన్న కొవ్వు కరగాలంటే కూడా గోరువెచ్చని నీటిని తాగాలి.అంతేకాకుండా గోరువెచ్చని నీటిలో నెయ్యి( Ghee ) వేసుకొని తాగడం వలన కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
దీని వలన పొట్ట శుభ్రంగా అయ్యి బరువు మొత్తం కరిగిపోతుంది.అలాగే వేడి నీళ్లు తాగడం వలన పొట్ట డీటాక్స్ అవుతుంది.
అయితే బరువు తగ్గాలనుకునే వ్యక్తులు వేడి నీటిలో తేనె( Honey ) అలాగే నిమ్మరసం( Lemon juice ) కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

అలాగే కొత్తిమీర లేదా మెంతులను( Fenugreek ) రాత్రంతా నానబెట్టి తాగిన కూడా మంచి ఫలితాలు ఉంటాయి.వేడినీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి.
అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.అలాగే ఇది చర్మానికి మెరుపునిస్తుంది.
అంతేకాకుండా కీళ్లనొప్పుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.అలాగే ముఖంపై తేమ అలాగే ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వలన జీవక్రియ పెరుగుతుంది.అలాగే ఈ నీరు శరీరాన్ని నిర్వీకరణ చేయడానికి కూడా మంచిది.

ఇక ఖాళీ కడుపుతో నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వలన షుగర్ లెవెల్స్( Sugar levels ) అదుపులో ఉంటాయి.అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది.ఇక నెయ్యిలో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉన్నాయి.ఇక ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఏ,కె,ఈ అదనంగా నెయ్యిలో విటమిన్ ఏ,సి లాంటివి ఉంటాయి.
ఈ మూలకాలు శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.ఇక చిన్న, పెద్ద ప్రేగు తరచుగా పొడిగా మారుతూ ఉంటుంది.
అలాంటప్పుడు ఆహారం జీర్ణం కావడం చాలా కష్టమవుతుంది.అలాంటి సందర్భాలలో వేడి నీటిలో ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వలన డైజెస్టివ్ ట్రాక్ లూప్రికేట్ అవుతుంది.
దీని వలన జీర్ణక్రియ బాగా ఉంటుంది.








