తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కనుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి ముక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తమ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్ని సర్వేలు చూసినా… చూసుకున్నా, వాస్తవాలు మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మంత్రి అన్నారు.
టిటిడి అధికారులు స్వామివారి దర్శనం అనంతరం మంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు.