ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చిన భార్య..!

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండే భర్తను తొలగించుకోవడం కోసం ప్రియుడు సహాయంతో భర్తను భార్య హత్య చేయించిన ఘటన మహబూబ్ నగర్ లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 The Wife Who Killed Her Husband With The Help Of Her Boyfriend , Wife , Mahabu-TeluguStop.com

ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.మహబూబ్ నగర్ జిల్లా( Mahabubnagar )లోని దేవరకద్ర మండలం గురుకొండకు చెందిన గడువు శ్రీనివాసులు (34) కు, మక్తల్ మండలం దాసరి దొడ్డికి చెందిన మాధవికి నాలుగు ఏళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.అయితే గురుకొండకు చెందిన యమన్న అనే వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధం( Extramarital Affiar ) పెట్టుకుంది.

అయితే మాధవి( Madhavi ) పుట్టింటికి వెళ్ళగా అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీనివాసులు ఇంటి నుంచి ఆటోలో బయటకు వెళ్లి రాత్రి ఇంటికి రాలేదు.ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో శ్రీనివాసులు సోదరుడు మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజులపాటు ఎంత గాలించినా ఎలాంటి వివరాలు తెలియలేదు.ఎవరి మీద నైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యులను అడగగా అదే గ్రామానికి చెందిన యమన్న అనే వ్యక్తి పేరు చెప్పారు.</b

పోలీసులు యమన్న ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయట పెట్టాడు.అక్టోబర్ ఒకటవ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాసులు మరికల్ లో యమన్న కలిశాడు.ఆ తర్వాత దేవసుగుగూర్ కు తీసుకువెళ్లి శ్రీనివాసులను హతమార్చే ఒక దుప్పట్లో మూటకట్టి ముళ్ళ పొదల్లో పారేశాడు.నిందితుడు పోలీసులకు చెప్పిన వివరాల తో మృతదేహాన్ని గుర్తించారు.

కుళ్ళిన స్థితిలో ఉండే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆసుపత్రికి తరలించారు.వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube