నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూడగా ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.
రిలీజ్ కు ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది.
దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేలా ప్రమోషన్స్ విషయంలో ముందుకు వెళుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసారు.
మరి ఈ ట్రైలర్ రిలీజ్ పై తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
ఏంటంటే.
ఈ మోస్ట్ ఏవైటెడ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) చేతుల మీదుగా విడుదల చేయనున్నారు అనే టాక్ వినిపిస్తుంది.అనిల్ రావిపూడికి మహేష్ తో మంచి స్నేహం ఉంది.
అటు బాలయ్య కూడా మహేష్ తో సన్నిహితంగా ఉంటారు.మరి ఈ నేపథ్యంలోనే వీరి కోసం మహేష్ ట్రైలర్ ను లాంచ్( Bhagavanth Kesari Trailer Launch ) చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
చూడాలి ఇందులో నిజమెంత ఉందో.
కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.