జీవితంలో తీసుకునే చిన్న పొరపాట్లే చివరికి పెద్ద ప్రమాదాల్లో పడేస్తుంటాయి.అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల కలిగే నష్టాలను కూడా అంచనా వేసుకోవడం మంచిది.
అయితే ఈ విషయంలో విఫలమైన ఒక ఎన్నారై చివరికి ప్రాణాలను కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే 2023, సెప్టెంబరు 9న రంజిత్ వర్మ అనే 55 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి( Indian American ) ఒక స్టంట్ చేయాలని భావించి చివరికి మృత్యువాత పడ్డాడు.ఈ ఎన్నారై గ్రాండ్ కాన్యన్లోని నార్త్ కైబాబ్ ట్రైల్( North Kaibab Trail )ను ఒకే రోజులో హైకింగ్ చేద్దాం అనుకున్నాడు.వర్మ మిత్రబృందంతో కలిసి దీనిని ఎక్కడం ప్రారంభించాడు.
నడుస్తూ ఉండగా మధ్యలో అతడు ఒకసారిగా కింద పడిపోయాడు.ఈ మిత్రబృందం సహాయం కోసం పిలిచింది, అయితే హెలికాప్టర్ వచ్చేలోపు వర్మ మరణించాడు.
వర్మ మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియ రాలేదు.దాన్ని కనిపెట్టేందుకు వైద్యులు అధికారులు విచారణ చేపట్టారు.అయితే అతను మరణానికి వేడి, డీహైడ్రేషన్( Dehydration ) కారణం కావచ్చు.గ్రాండ్ కాన్యన్లో ఉష్ణోగ్రతలు నీడలో కూడా 120°F (49°C) కంటే ఎక్కువగా ఉంటాయి.
నార్త్ కైబాబ్ ట్రైల్ కూడా 6,000 అడుగుల ఎత్తులో ఉన్న కాన్యన్లోని అత్యంత సవాలుగా ఉండే మార్గాలలో ఒకటి.ఇందులో ప్రయాణించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

నిజానికి గ్రాండ్ కాన్యన్ హైకింగ్ చేయడానికి ఒక అందమైన ప్రదేశం, అయితే ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.హీట్ స్ట్రోక్( Heat Stroke ), డీహైడ్రేషన్, అలసట అన్నీ ఇక్కడ వేధించే సాధారణ సమస్యలు.పుష్కలంగా ద్రవాలు త్రాగడం, సన్స్క్రీన్ ధరించడం, నీడలో విరామం తీసుకోవడం చాలా ముఖ్యం.మీకు అనారోగ్యంగా అనిపిస్తే, వెనుకకు తిరగడం మంచిది.దారి తప్పిపోకుండా ట్రయల్లోనే వెనక్కి వెళ్లడం ముఖ్యం.కొద్ది రోజుల క్రితం కొందరు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండాలని అడవిలోకి వెళ్లి జీవిద్దాం అనుకున్నారు కానీ వారిని చలి చంపేసింది.
ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.







