నల్గొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో 2016 లో తిరుమలగిరి (సాగర్) మండలం ఏర్పాటు చేశారు.అప్పుడున్న సింగిల్ రోడ్డున డబుల్ రోడ్డుగా మార్చుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఏళ్లు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులకు అతీగతీ లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త మండలం ఏర్పాటుతో వివిధ పనుల నిమిత్తం మండల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఉండడం, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో వందల సంఖ్యలో వాహనాల రద్దీ పెరిగడంతో సింగిల్ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరిగి అనేకమంది గాయపడ్డారని వాపోతున్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే తిరుమలగిరి సాగర్ మండలానికి డబుల్ రోడ్డు నిర్మాణం గుర్తొస్తుందని,ఎన్నికలు అయ్యాక దాని ఊసెత్తే నాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని డబుల్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.