తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మరోసారి నివేదిక సమర్పించింది.ఈ మేరకు నివేదికను పిటిషనర్లకు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
గతంలో ప్రభుత్వం సమర్పించిన రిపోర్టు అసంపూర్తిగా ఉందని ఈ క్రమంలో మరోసారి సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం నివేదికను సమర్పించింది.
టీఎస్ సర్కార్ సమర్పించిన నివేదికపై న్యాయస్థానంలో రేపు వాదనలు జరగనున్నాయి.







