ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించలేదు..: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చర్చించలేదని ఆరోపించారు.

 Public Issues Were Not Discussed In The Assembly..: Revanth Reddy-TeluguStop.com

సభలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై స్పందించలేదని పేర్కొన్నారు.

ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సభలో సమస్యలపై మాట్లాడకుండా తనపైనే చర్చ జరిగిందని తెలిపారు.కేసీఆర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారని మండిపడ్డారు.

గతంలో సోనియా దయవలనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.కానీ ఇప్పుడేమో కాంగ్రెస్ వలనే తెలంగాణలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని దుయ్యబట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube