సాధారణంగా కొందరికి తరచూ కళ్ళు మంట పుడుతూ ఉంటాయి.కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, పోషకాల లోపం, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు, దుమ్ము, ధూళి, ఎక్కువ సమయం పాటు ఫోన్లు, టీవీలతో గడపడం, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళు మంట పడుతుంటాయి.
ఈ నేపథ్యంలోనే కళ్ళ మంటలను ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.
సులభంగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
కళ్ళ మంటను తగ్గించడంలో బంగాళదుంప అద్భుతంగా సహాయపడుతుంది.పీల్ తీసిన బంగాళదుంపు తీసుకుని స్లైసులుగా కట్ చేసి గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.ఆ తర్వాత వాటిని తీసుకుని కళ్ళపై ఉంచుకోవాలి.ఇలా చేస్తే.
కొంత సమయానికి కళ్ళ మంటలు తగ్గుముఖం పడతాయి.</br?
ఎగ్స్ కూడా కళ్ళ మంటలను తగ్గిస్తాయి.ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ళపై అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
గులాబీ రేకులను నీటిలో వేసి కలర్ ఛేంజ్ అయ్యే వరకు మరిగించాలి.ఆ తర్వాత నీటిని వడబోసుకుని చల్లగా అయిన తర్వాత దూది సాయంతో కళ్ళపై అద్దుకోవాలి.ఇలా చేసినా కూడా కళ్ళ మంటల నుంచి ఉపశమనం పొందుతారు.
అలాగే కళ్ళు మంటలు పుడుతున్నప్పుడు కంప్యూటర్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ వంటి గడ్జెట్స్ను వాడటం తగ్గించండి.
విశ్రాంతి తీసుకోండి.వాటర్ తాగుతూ ఉండండి.
మరియు చల్లటి నీటితో తరచూ కళ్ళను శుభ్రం చేసుకోండి.తద్వారా మంటలు తగ్గుతాయి.