అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.లారీని తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది.
కసింకోట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.జంగారెడ్డిగూడెం నుంచి విశాఖకు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







