సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ బాగా పెరిగింది.అందుకోసమే ప్రతిరోజు వారు తీసుకునే ఆహార పదార్థాలలో పౌష్టిక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు.
చాలా పౌష్టిక ఆహారాలలో ఎండు ద్రాక్ష కూడా ఒకటి.దీనినే కిస్మిస్ అని కూడా అంటారు.
ఇది గోధుమ రంగులో ఉంటుంది.ఈ ఎండుద్రాక్షను ఎక్కువగా తీపి పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటారు.
![Telugu Dry Grapes, Tips, Kismis, Liver-Telugu Health Tips Telugu Dry Grapes, Tips, Kismis, Liver-Telugu Health Tips](https://telugustop.com/wp-content/uploads/2023/02/liver-health-health-tips-dry-grapes-Kismis.jpg )
కొందరు వీటిని నేరుగా కూడా తింటూ ఉంటారు.అయితే ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఎండుద్రాక్షను నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మనం మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోము.
కానీ కిస్మిస్ నానబెట్టిన నీళ్లు ఆ వ్యర్థాలను బయటకు పంపడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను నానబెట్టిన నీరు మన శరీరాన్ని శుభ్రం చేస్తుంది.శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
లివర్ ను కూడా ఇది పరిశుభ్రం చేస్తుంది.దీని వల్ల లివర్లోని మలినాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి.
ఈ నీళ్లను నాలుగు రోజులపాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
![Telugu Dry Grapes, Tips, Kismis, Liver-Telugu Health Tips Telugu Dry Grapes, Tips, Kismis, Liver-Telugu Health Tips](https://telugustop.com/wp-content/uploads/2023/02/liver-health-health-tips-dry-grapes-Kismis-digestive-problems.jpg )
జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రం అవుతుంది.దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు.ముఖ్యంగా చెప్పాలంటే గుప్పెడు కిస్మిస్ లను తీసుకుని రెండు కప్పుల నీటిలో వేసి నీళ్లు ఒక కప్పు అయ్యేవరకు సన్నని మంటపై మరిగించాలి.
నీరు మరిగిన తర్వాత ఆ స్టవ్ ను ఆఫ్ చేసి ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి.మరుసాటి రోజు ఉదయాన్నే పరగడుపున క్రిస్మస్ లను తిని ఆ నీటిని తాగాలి.
ఇలా క్రమం తప్పకుండా నాలుగు రోజులు చేయడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.లివర్ లోని వ్యర్ధాలు బయటకి పోతాయి.లివర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.