తెలంగాణ వచ్చాక దాదాపు నాలుగు వేల గిరిజనుల తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.గతంలో మన్యం మంచం పట్టే పరిస్థితి ఉండేదన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీని కూడా తెచ్చుకున్నామని తెలిపారు.ఈ ఒక్క జిల్లాలోనే 47 వేల ఎకరాలకు పోడు పట్టాలిస్తున్నామని పేర్కొన్నారు.
పోడు పట్టాలు పొందిన గిరిజనులకు రైతుబంధు ఇస్తామన్నారు.ఆదివాసీ, గిరిజనుల పొలాలకు త్రీ పేస్ కరెంట్ ను ఇస్తామని చెప్పారు.
పోడు భూముల అంశంలో గిరిజనులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.ధరణిపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
నిరుపేదల కోసమే కంకణం కట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.







