పవన్ తో సంబంధం లేకుండా 'ఓజీ' పూర్తి అవుతోంది

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వచ్చే నెలలో బ్రో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఇదే ఏడాది లో పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమా తో( OG Movie ) కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సాహో దర్శకుడు సుజీత్( Sahoo Sujeeth ) దర్శకత్వం లో రూపొందుతున్న ఓజీ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ లేకుండానే ఎక్కువ రోజుల పాటు ఓజీ సినిమా యొక్క షూటింగ్‌ జరుగుతోంది.

గత వారం పది రోజులుగా కంటిన్యూ గా ఓజీ సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉంది.మరో వైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో భాగంగా ఏపీ లో ఉన్నాడు.

అక్కడ రాజకీయ పార్టీ పనులతో బిజీగా ఉన్నాడు.అయినా కూడా ఓజీ సినిమా షూటింగ్‌ జరగడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో ఓజీ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement

పవన్‌ కళ్యాణ్‌ మరియు సాహో సుజీత్ లకు ఈ ప్రాజెక్ట్‌ అత్యంత కీలకం.అందుకే ఈ సినిమా ను వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు.సాహో సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చినా కూడా దర్శకుడు సుజీత్ కి మంచి పేరును తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.

అందుకే పవన్‌ సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి.పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఆయన వస్తేనే షూటింగ్‌ చేయాలని అని పట్టుకుని కూర్చుంటే రెండు మూడు సంవత్సరాలు అయినా సాధ్యం అయ్యే పని కాదు.

అందుకే దర్శకుడు సుజీత్‌ చాలా తెలివిగా పవన్ లేని సన్నివేశాలను షూట్‌ చేస్తున్నాడు.పవన్‌ ఉన్న సన్నివేశాలను కూడా విభిన్నంగా షూట్‌ చేస్తున్నాడు.కనుక చాలా స్పీడ్‌ గా షూటింగ్‌ ముగించే అవకాశాలు ఉన్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు