టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన శివాజీ సీఎం జగన్ గురించి విమర్శలు చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
వైసీపీ రాజకీయ అవసరాలు ఆ పార్టీకి ఉంటాయని వాళ్ల వ్యూహం కూడా తప్పని నేను అనుకోనని శివాజీ చెప్పుకొచ్చారు.
బాలయ్య ఆస్పత్రి ద్వారా చేసే సేవ నాకు చాలా ఇష్టమని బాలయ్య బాబు భోళా శంకరుడు అని శివాజీ కామెంట్లు చేశారు.
ఇక్కడ మనం టైం ఉన్నంత కాలం ఏది వాయించినా రకరకాలుగా వినిపిస్తుందని శివాజీ అన్నారు.బాలయ్యకు నాయకత్వ లక్షణాలు లేకపోతే ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యారని శివాజీ ప్రశ్నించారు.
నేనెందుకు మెగాస్టార్ కాలేదంటే ఎలా చెప్పగలనని శివాజీ అభిప్రాయపడ్డారు.

చిన్న ఊరిలో జన్మించిన సిద్ధరామయ్య ఊహించని స్థాయికి ఎదిగారని ఆయన తెలిపారు.మనం ఎవరూ డిసైడ్ చెయడానికి అర్హులం కాదని ఆయన చెప్పుకొచ్చారు.మనం మన అభిప్రాయం మాత్రం చెప్పగలమని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ప్రజలు కరెంట్ బిల్లులు తగ్గించాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.వైసీపీ ప్రభుత్వం 2024లో అధికారంలోకి రాదని శివాజీ అన్నారు.

ఒక ముఖ్యమంత్రికి ఇది చాలా విలువైన సమయం అని జగన్ ఇప్పటికైనా మార్చుకోవాలని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.50,000 కోట్ల రూపాయలు ఏపీకి వచ్చాయని జగన్ లెక్కలు చెప్పాలని శివాజీ పేర్కొన్నారు.నెల రోజుల్లో ఈ మొత్తం ఏపీకి కేంద్రం ఇచ్చిందని ఆయన తెలిపారు.సీఎం జగన్ ఆ మొత్తంతో ఏం చేయబోతున్నారో చూడాలని శివాజీ అన్నారు.వైసీపీ వర్సెస్ ప్రజలు అనేది జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.నేను గ్రౌండ్ రియాలిటీ చెబుతున్నానని శివాజీ వెల్లడించారు.







