జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు.పవన్ వి పిచ్చి మాటలని చెప్పారు.
ఒకసారి సీఎం అంటాడు, ఇంకోసారి ఎమ్మెల్యే అంటాడన్నారు.
కేఏ పాల్ మాటలు, పవన్ మాటలకు తేడా లేదని మంత్రి ఆదిమూలపు విమర్శించారు.
పవన్ ఒక్కో రోజు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు.అవినీతి ఎక్కడ జరిగిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆధారాలు ఉంటే పవన్ నిరూపించాలని సూచించారు.







