నిన్న మొన్నటి వరకు పొత్తు తప్పదన్నారు.కలిసి వెళ్తామంటూ కలుపుకు పోతామంటూ రాజకీయ వేడిని పెంచారు.
ఇప్పుడేమో నీ దారి వేరు నా దారి వేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.ఇంతకీ వాళ్ళు ఎవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.
ఎవరోకాదండీ వాళ్లే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan kalyan ).ఈ ఇద్దరు కూడా జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు తప్పదు అన్నట్లుగా వ్యవహరించారు నిన్న మొన్నటివరకు.టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ పరోక్షంగా చాలాసార్లు స్పష్టం చేశారు.అటు చంద్రబాబు కూడా పవన్ తో కలవడానికి అమితంగానే ఆసక్తి కనబరిచారు.

ఈ నేపథ్యంలోనే అధినేతలిద్దరూ పలుమార్లు బేటీ కావడం, ఒకరికి ఒకరు మద్దతుగా నిలవడం వంటివి చేస్తూ వచ్చారు.అయితే ఏమైందో తెలియదు గాని ప్రస్తుతం ఇద్దరు వేరే ఏజండాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.తనకు ఒక్కసారి సిఎం ఛాన్స్ ఇవ్వండి అంటూ పవన్ చెబుతుంటే.టీడీపీని( TDP ) 175 స్థానాల్లో గెలిపించండి అంటూ చంద్రబాబు చెబుతున్నారు.ప్రస్తుతం వీరిద్దరి వైఖరి చూస్తుంటే పొత్తుపై కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.175 స్థానాల్లో టీడీపీ గెలవాలని చంద్రబాబు కోరుకోవడం చూస్తే.జనసేనను పక్కన పెట్టెసినట్లే తెలుస్తోంది.టీడీపీకి అధికారం ఇవ్వండి అంటూ ఇన్నాళ్ళు చెబుతూ వచ్చిన బాబు.సీట్ల విషయంలో ఎప్పుడు స్పష్టత ఇవ్వలేదు.

ఎందుకంటే అప్పుడు జనసేనతో పొత్తు ఆలోచన కారణంగా సీట్ల ప్రస్తావన చంద్రబాబు తీసుకొచ్చేవారు కాదు.పవన్ కూడా టీడీపీతో పొత్తు ఉండే అవకాశం ఉంది కాబట్టే సిఎం పదవిపై ఆశ లేదన్నట్లుగానే వ్యవహరించాడు.కానీ ఇప్పుడు తన టార్గెట్ సిఎం పదవే అని పవన్ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.
దీంతో సీట్ల విషయంలో టీడీపీ జనసేన( Jana sena ) మద్య క్లాష్ వచ్చిందా ? అందుకే అధినేతలు ఇద్దరు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారా ? అనే డౌట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.అయితే ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది కాబట్టి ఇరు పార్టీల వైఖరి ఎంటనేది అప్పుడే నిర్ణయించలేమనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.మరి రెండు పార్టీల మద్య పొత్తు ఉంటుందో లేదో చూడాలి
.






