కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు హని కలిగించే యాప్ లను బ్యాన్ చేస్తోంది.ఇప్పటికే ఎన్నో యాప్ లను నిషేధించి, తాజాగా మరో మూడు యాప్లను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఐటీ శాఖ తాజాగా ఏ ఏ యాప్ లను నిషేధించాలని నిర్ణయం తీసుకుందో చూద్దాం.

గేమింగ్ యాప్( gaming app ) ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్( Minister Rajeev Chandrasekhar ) తెలిపారు.ఇటీవలే ఈ గేమింగ్ యాప్ లో బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.అంతేకాకుండా గేమ్స్ ద్వారా మతమార్పిడి వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
కాబట్టి గేమింగ్ యాప్ ద్వారా హాని తప్ప ప్రయోజనం పెద్దగా లేదని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ను నిషేధించాలని నిర్ణయించుకుంది.

దేశ భద్రతకు ముప్పు పొంచి ఉండే కారణంగా ఈ యాప్స్ ను నిషేధించనుంది.కేంద్ర హోంశాఖ గత ఏడాదిలో 54 యాప్స్ ను నిషేధించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.ఇందులో 10 యాప్స్ గేమింగ్ ఆప్స్ కావడం గమనార్హం.
ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చైనాకు సంబంధించిన 300 చైనా యాప్స్ ను నిషేధించింది.ఇంకా ఈ జాబితాలో 230 యాప్స్ ఉన్నట్లు సమాచారం.
అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో మరెన్నో యాప్లను నిషేధించే అవకాశం ఉంది.తాజాగా ఆన్లైన్ గేమింగ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూల్స్ తయారు చేసింది.
త్వరలోనే ప్రభుత్వం నుంచి ఈ యాప్స్ బ్యాన్ అవుతున్నట్లు కీలక ప్రకటన వెలువడ ఉంది.బెట్టింగ్ యాప్స్, యూజర్లకు ప్రమాదం కలిగించే యాప్స్, అడిక్షన్ యాప్స్ లను కేంద్రం నిషేధించనుంది.
హలో, యూసీ బ్రౌజర్, పబ్జి, టిక్ టాక్ లాంటి యాప్స్ ఇప్పటికే నిషేధించబడ్డాయి.త్వరలో చాలా యాప్స్ నిషేధానికి గురి అవ్వనున్నాయి.







