ఖమ్మం లోని SR కన్వెన్షన్ హాల్ నందు APSWR కల్లూరు పాఠశాల 1995-96, 1996-97, 1997-98 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ప్రముఖ వైద్యులు, పొంగులేటి శ్రీనన్న మధిర నియోజకవర్గ ఇన్చార్జి డా.
కోట రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ కలయిక లో వారికి విద్యాబోధన లు నేర్పిన గురువులకు ఘన సన్మానం చేశారు.
ఈరోజు విద్యార్థులు అందరూ ఈ స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం విద్యాబోధన లు నేర్పిన ఈ గురువులే అని వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం అని డా.
కోట రాంబాబు అన్నారు.వారు విద్యాబోధన లు నేర్పిన విద్యార్థులు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని వారు ఇంకా వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు
.






