తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 వ తేదీన నిర్వహించే తెలంగాణ రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్( Vishnu ).వారియర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రన్ నిర్వహణపై శనివారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ రన్ను నిర్వహించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్( Puvwada Ajay Kumar ) గారు ముఖ్యతిధిగా పాల్గొని తెలంగాణ రన్ ప్రారంభిస్తారని తెలిపారు.నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై లకారం ట్యాంక్ బండ్ వరకు తెలంగాణ రన్ కొనసాగుతుందన్నారు.ఈ రన్లోనగరంలోని క్రీడాకారులు, యువత, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు,ప్రజప్రతినిధులు, పోలీసులు వేలది మంది పాల్గొంటారని వెల్లడించారు.







