మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు.
ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారంటూ అధికారులు చర్యలకు పాల్పడ్డారు.రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి జేసీబీలతో గుడిసెలను తొలగించారు.
దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనంతరం అధికారులను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు.
ఈ క్రమంలో తీవ్ర టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







