వైసీపీ ప్రభుత్వంపై నాదెండ్ల తీవ్ర విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభుత్వం విస్మరించిందని నాదెండ్ల మండిపడ్డారు.ఏపీలో కక్ష సాధింపు తప్ప ఎక్కడా అభివృద్ధి లేదని ఆరోపించారు.ఆరోగ్య శ్రీకి వెయ్యి కోట్ల బకాయి ఉంటే రాష్ట్ర సర్కార్ కేవలం రూ.100 కోట్లే ఇచ్చిందని తెలిపారు.రాష్ట్ర భవిష్యత్ ను జగన్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు.

అవినీతి రహిత ఏపీ ఏర్పాటే జనసేన లక్ష్యమని వెల్లడించారు.రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే పొత్తులు ఉంటాయని తెలిపారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు