ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ఆర్థిక స్థితిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి ప్రభుత్వ రంగ సంస్థలకు పూచీకత్తు ఇవ్వొచ్చని దువ్వూరి కృష్ణ తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థ అప్పులపై వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామన్నారు.
పవర్ సెక్టార్ లో ఉన్న అప్పులను పవర్ సెక్టార్ తీరుస్తుందని చెప్పారు.గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు తీసుకున్నామని తెలిపారు.