మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను అధికారులు హైదరాబాద్ కు తరలించారు.అనారోగ్య సమస్యతో తిరుపతిలోని స్విమ్స్ లో రంగన్న చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో రంగన్నకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.