ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,బన్నీ వాసులు ఇప్పటికే గీత ఆర్ట్స్ టు బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పుడు మరో సరికొత్త ప్రాజెక్టు కూడా రానుంది.
మలయాళ సినిమా నయట్టు కి రీమేక్( Nayattu Remake ) గా తెరకెక్కబోతోంది.ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అందులో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించారు.తెలుగులో రీమిక్ కాబోతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు స్టార్ హీరో శ్రీకాంత్( Srikanth ) నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇది ఒక పోలీస్ డ్రామా కాగా, మలయాళంలో చాలా బాగా రూపొందించారు.తెలుగులో ఎలా మార్పులు చేసి తీసుకుంటారో చూడాలి మరి.

పోలీస్ డ్రామా కాబట్టే దీనికి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది.ముందు ఈ సినిమాని పెద్ద నటులతో కొంచెం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాగా తీయాలని ప్లాన్ చేసినప్పటికి, అంత బడ్జెట్ ఎందుకని చిన్న బడ్జెట్ లో తీయాలి అనుకొని ఈ సినిమా చిన్న నటుల్ని పెట్టి తీస్తున్నారు అని తెలిసింది.తెలుగు రీమేక్ లో శివాత్మిక రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా పోషిస్తుండగా, యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.మలయాళం లో ఒక మహిళా పోలీస్ అధికారి పాత్ర కీలకం.

ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్ర కోసమని వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar )కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ ని తీసుకున్నారట.షూటింగ్ ఆరుకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా గురించి ఇంకా అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు.ఈ సినిమాను గత ఏడాదే రూపొందించాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాలు ఉన్నాయి ఈ సినిమా వాయిదా పడింది.
మరి ఈ వార్తలపై అల్లు అరవింద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.







