జాతీయస్థాయిలో BRS పార్టీని రాణించడానికి కేసీఆర్( KCR ) పోరాడుతున్న సంగతి తెలిసిందే.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనీ టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకునే పనిలో ఉన్నారు.
ఇదే సమయంలో బీజేపీ పార్టీతో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.BRS పార్టీని తెలంగాణ చుట్టుప్రక్కల ఉన్న రాష్ట్రాలలో విస్తరిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ఆల్రెడీ ఇప్పటికే మహారాష్ట్రలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.

భారీ ఎత్తున ప్రజల నుండి రెస్పాన్స్ రావడం జరిగింది.త్వరలోనే మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.త్వరలో ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఏపీ BRS నాయకులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకి చెందిన సీనియర్ నాయకులు BRS పార్టీలో చేరడం జరిగింది.ఆదివారం ప్రగతి భవన్ లో శివసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అన్నా సాహెబ్ మానేతో పాటు పలువురికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఇక ఇదే సమయంలో గంగాపూర్ నియోజకవర్గ నేత సంతోష్ కుమార్… ఔరంగాబాద్ NCP యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పాటిల్ ఉన్నారు.







