నాగర్సోల్ – నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ జరిగింది.మహారాష్ట్రలోని పర్భాని జంక్షన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలులోని ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, సెల్ ఫోన్లతో పాటు విలువైన వస్తువులను దుండగులు అపహరించారు.అందులో భాగంగానే విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి నాలుగు లక్షల విలువైన బంగారంతో పాటు రూ.30 వేలు ఎత్తుకెళ్లారు.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.