ప్రస్తుత సమాజంలో ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్ధకం వంటి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యల( Digestive problems ) కోసం కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల సహజ సిద్ధంగా తగ్గించుకోవచ్చు.
ఎసిడిటీ సమస్యను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు నీటిలో 20 ml వేడి చేసి చల్లార్చిన పాలు( milk ), ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి( Cow ghee ) వేసి బాగా కలుపుకోవాలి.
ఎసిడిటీ సమస్య( Acidity )తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు భోజనం చేసిన తర్వాత ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ సమస్య కోసం మరో చిట్కా ఏమిటంటే, ముందుగా జీలకర్ర( cumin )ను వేయించి పొడిగా చేసుకోవాలి.తర్వాత ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి.తర్వాత ఒక చెక్క నిమ్మకాయను అర సెకండ్ పాటు నేరుగా మంటపై వేడి చేయాలి.నిమ్మకాయ వేడయ్యాక దాని నుంచి ఈ రసాన్ని తీసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వెంటనే తాగాలి.ఈ చిట్కాలు వాడటం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గడంతో పాటు కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు ఒక గ్లాసు మజ్జిగలో జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు కొద్దిగా బెల్లం వేసి బాగా కలపాలి.ఈ విధంగా మజ్జిగను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు అన్ని దూరం అవుతాయి.