టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు.
ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో పలు సినిమాలు రాగా తాజాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు తదుపరి సినిమాలో బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి కనిపించనుందట.బాలీవుడ్ ఇండస్ట్రీకీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అమితాబ్ బచ్చన్ ఒకప్పటి స్నేహితురాలు రేఖ ఇప్పుడు సౌత్ సినిమాలో కనిపించనుంది.ఈ చిత్రంలో రేఖ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను ఈ రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఇకపోతే ఇదివరకే తెలుగు సినిమాల్లో నటించిన రేఖ ఇప్పుడు చాలాకాలం తర్వాత మహేష్ బాబు సినిమాతో ఇస్తోంది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు.
శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అయిపోగానే వెంటనే మొదలు పెట్టమన్నారు.కాగా మహేష్ బాబు నటిస్తున్న సినిమా 2023 ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.







