'వీరసింహారెడ్డి' 50 రోజులు పూర్తి.. ఎమోషనల్ అయిన గోపీచంద్!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”వీరసింహారెడ్డి”.ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.

 50 Days Of Veerasimha Reddy Director's Emotional Post, Veera Simha Reddy, Nandam-TeluguStop.com

అఖండ వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.అందుకే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

అలాగే దునియా విజయ్ విలన్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ లో నటించింది.ఇక ఈ సినిమా ఇటీవలే ఓటిటి లోకి కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఓటిటిలో కూడా బాలయ్య వీరసింహారెడ్డి దుమ్ములేపుతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా 50 రోజుల సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో పూర్తి చేసుకుంది.దీంతో ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు.ఈ సినిమా విషయంలో ఈయన ఎలా ఫీల్ అయ్యాడు అనేది పోస్ట్ ద్వారా చెప్పాడు.

గోపీచంద్ మలినేని పోస్ట్ చేస్తూ.”ఒక మర్చిపోలేని అనుభూతిని.అలాగే లెక్కలేనన్ని జ్ఞాపకాలను మీరు అందించారు.గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారితో ఒక వీర మాస్ బ్లాక్ బస్టర్ ను అందుకోవడం అనేది నాకు ఒక కల లాంటిది” అని బాలయ్యకు స్పెషల్ గా ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube