టాలీవుడ్ లో రోజురోజుకూ ప్రేక్షకుల అభిరుచి మారిపోతున్న నేపథ్యంలో హీరోలు, మేకర్స్ కూడా డిఫెరెంట్ గా ఆలోచిస్తున్నారు.ఇది వరకులా సినిమా అంటే 5 పాటలు, నాలుగు ఫైట్స్, కొన్ని డైలాగ్స్, హీరోయిజం, హీరోయిన్ గ్లామర్ ఇవే కనిపించేవి.
అలాగే కమర్షియల్ జోనర్ కథలు మాత్రమే హీరోలు చేసేవారు.ఈ కమర్షియల్ కథలు చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది.
దీంతో ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే వెంటనే వాటిని రిజక్ట్ చేసేస్తున్నారు.స్టార్ హీరోలను చూసి చిన్న హీరోలు కూడా అదే చేస్తున్నారు.కానీ కమర్షియల్ పరంగా వర్కౌట్ అవ్వడం లేదు.సినిమాలో రొటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉంటే ప్రేక్షకులు ఆదరించడం లేదు.
అయితే ఈ మధ్య కాలంలో మన సినిమాల విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

దీంతో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా మంచి హిట్స్ అందుకుంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.స్టార్ హీరోల సినిమాలను చూసి చిన్న హీరోలు సైతం తమ సినిమాలలో కథ, కథనం కొత్తగా, థ్రిల్లింగ్ గా ఉండేలా చూసుకుంటున్నారు.మరి ఈ సమ్మర్ లో రాబోతున్న హీరోలు డిఫెరెంట్ జోనర్స్ తో రాబోతున్నారు.

మరి యంగ్ హీరోలు రాబోతున్న సినిమాలు ఏంటంటే.సాయి ధరమ్ తేజ్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్నాడు.రవితేజ రావణాసుర సినిమాతో క్రైం థ్రిల్లర్ జోనర్ లో రాబోతుండగా రామ్ పోతినేని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ జోనర్ లో మూవీ చేస్తున్నాడు.ఇక నాని దసరా మూవీ మాస్ మూవీగా ఉండనుంది.
నిఖిల్ స్పై, అఖిల్ ఏజెంట్, గోపీచంద్ రామబాణం సినిమాలతో థ్రిల్లర్ జోనర్ లలో వస్తున్నాయి.అలాగే శాకుంతలం మైథలాజికల్ కథాంశంతో రాబోతుండగా.
హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.ఇలా చిన్న హీరోలు కూడా డిఫెరెంట్ జొనరేస్ లో సినిమాలు చేస్తున్నాడు.







