ఎమ్మెల్యే కేతిరెడ్డి పాదయాత్రకు వ్యతిరేకంగా కరపత్రాల కలకలం

అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పాదయాత్ర చేపట్టారు.ఈ క్రమంలో పాదయాత్రకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి.

పెద్దారెడ్డిది పాదయాత్ర కాదు.పశ్చాత్తాప యాత్ర అని, పెద్దవడుగూరుకు పెద్దారెడ్డి చేసింది శూన్యమంటూ కరపత్రాలు వెలిశాయని సమాచారం.

అయితే వెంచర్లకు రేట్ ఫిక్స్ చేసి దోపిడీ చేశారంటూ పెద్దారెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.దోపిడీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే అయిన తన ఇంటికే ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చారంటూ కరపత్రాలు దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు