గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.కేంద్రం విధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయట్లేదని చెప్పారు.
కేంద్ర నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు.సర్పంచ్ ల నిధులు దారి మళ్లించినందుకు ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ ల హక్కులను కాలరాశారని విమర్శలు గుప్పించారు.







