టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది.ఇందులో భాగంగా కవిత ట్వీట్ కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ అంటూ రీ-ట్వీట్ చేశారు.కవిత లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం.
జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పారు.కవితను కేటీఆర్, కేసీఆర్ కూడా కాపాడలేరని ట్వీట్ చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో తనను నేరుగా ఎదుర్కోలేదన్న ఆయన కోల్ మైన్ పై విష ప్రచారం చేశారని ఆరోపించారు.తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రచారం చేశారని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబమంతా జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.







