ఏపీలో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ నేత బ్రహ్మారెడ్డి అన్నారు.ఇవాళ ఉదయం కూడా తమ ఇళ్లపై దాడులు జరిగాయని చెప్పారు.
తమ పార్టీ కార్యాలయంతో పాటు కార్యకర్తల నివాసాలపై కూడా ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు.తలుపులు ధ్వంసం చేసి టీడీపీ కార్యాలయంలో నగదును ఎత్తుకెళ్లారని ఆరోపించారు.
మాచర్లలో ఎస్పీ ఉన్నా కూడా వైసీపీ దాడులు మాత్రం ఆగలేదని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.







