విజయవాడ సంకల్ప సిద్ధి కుంభకోణంలో దర్యాప్తు..!

విజయవాడలో వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కుంభకోణంలో నిజాలు ఇవాళ బహిర్గతం కానున్నాయని తెలుస్తోంది.వేణుగోపాల కృష్ణ, ఆయన భార్య, కిరణ్ డైరెక్టర్లుగా సంకల్ప సిద్ధి సంస్థ ఏర్పాటైంది.

 Investigation In Vijayawada Sankalpa Siddhi Scam..!-TeluguStop.com

కంపెనీల చట్టానికి తూట్లు పెట్టి జీఎస్టీతో కంపెనీ భూములు ఉన్నాయంటూ మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.లేని భూముల్లో ఎర్రచందనం మొక్కలున్నాయంటూ తప్పుడు ఆశలు చూపించారని తెలుస్తోంది.

ధనార్జనే ధ్యేయంగా అబద్ధాలతో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.సంస్థ వసూలు చేసిన రూ.1400 కోట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటకకు ఆరు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి.

కాగా ఈ కుంభకోణంలో మొత్తం 40 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.అదేవిధంగా ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయనే దానిపై, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube