బాలీవుడ్ చచ్చిపోతుంది.ఇది అందరు ఒప్పుకోవాల్సిన, ఒప్పుకుంటున్న నిజం.
సౌత్ ఇండియా సినిమాలు హిందీ వల్ల సినిమాలను మించి కుమ్ముతున్నాయి.ఇది కూడా అందరు అంగీకరిస్తున్నారు.
మరి బాలీవుడ్ కి ఈ కర్మ ఎందుకు పట్టింది.ఇలా ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుంది.
ఎదో ఒకటి రెండు సినిమాలు అంటే పర్వాలేదు కానీ దాదాపు బాహుబలి వచ్చినప్పటి నుంచి మెల్లి మెల్లి గా కుదేలవుతన్న బాలీవుడ్ ఇప్పుడు పూర్తిగా క్షణీనించింది.మరి ఇంకా ఎన్నాళ్లు ఇలా నడుస్తుంది.
బాలీవుడ్ కి ఈ గతి పట్టడానికి కారణం పక్క స్వయం కృపరాధమే.కథలు, కథనాలు మారాలి.
పక్క ప్రెసెంటేషన్ ఉండాలి.నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి.మరి ఇది జరుగుతుందా ? అంటే చాల కష్టం.అక్షయ్ కుమార్ లాంటి ఒకరిద్దరు హీరోలు తప్ప ఎవరు ఆ సాహసం చేయడానికి ముందుకు రావడం లేదు.ఇక నిన్నటికి నిన్న ఎంతో మంచి పేరు ఉన్న రాజశ్రీ ప్రొడక్షన్ వారు గతంలో ఎన్నో హిట్టు సినిమాలు తీసిన దర్శకుడు సూరజ్ జర్జాత్యా ను పెట్టుకొని, అమితాబ్, బోమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్, సారిక, నీనా గుప్తా, పరిణితో చోప్రా వంటి అగ్ర తారాగణం తో ఒక సినిమా తీస్తే సినిమా నిర్మాణంలో 80 శాతం కేవలం పారితోషకాల రూపం లో వెళ్ళిపోయింది.
అది కూడా నాసిరకం కథతో.ఇక బాలీవుడ్ ఎలా గట్టెక్కుతుంది చెప్పండి.అమితాబ్ ఈ వయసులో కూడా 10 కోట్లకు తక్కువ ఇస్తే ఒప్పుకోడు.నీనా గుప్తాను జనాలు ఎప్పుడో మర్చిపోయారు.అయినా ఆమెను పట్టుకొచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు.పరిణితి వంటి హీరోయిన్ కి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు.
ఇక కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో సూపర్ ఫామ్ లో ఉన్న అనుపమ్ ఖేర్ కి కోటిన్నర ముట్ట చెప్పారు.
ఇక సారిక కు కూడా 75 లక్షలు ఇచ్చారట.అంతే కాదు సినిమాలో ఇలా వచ్చి ఆలా వెళ్లిపోయే పాత్రలో నటించిన Danny Dengonzpa కు సైతం కోటిన్నర ఇచ్చారట.ఇలా ఇన్ని కోట్లు కేవలం పారితోషకం రూపం లో పోవడం వల్ల సినిమా ఎలా గట్టెక్కుతుంది.
కానీ ఈ సినిమాకు మౌత్ టాక్ బాగానే వచ్చింది.వసూళ్ళు కూడా పర్వాలేదు అంటున్నారు.
లేకపోతే అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా కూడా చచ్చిపోయేది.