1.కిషన్ రెడ్డి పై కేటీఆర్ కామెంట్స్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ విమర్శించారు.
2.బాసరలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు
బాసర సరస్వతీ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
3.నేడు రాజన్న సిరిసిల్లలో గవర్నర్ పర్యటన
నేడు వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగునున్నాయి.సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్ తమిళ్ సౌందర్య హాజరుకానున్నారు.
4.ఖానాపూర్ లో కార్డెన్ సెర్చ్
నిజామాబాద్ నగరంలోని ఒకటో డివిజన్ లోని ఖానాపూర్ భాగ్యనగర్ కాలనీలో పోలీసులు కార్బన్ సెర్చ్ నిర్వహించారు.
5.బండి సంజయ్ కామెంట్స్
ఆర్.ఎం.పి , పిఎంపీ లపై తెలంగాణ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
6.రేపు గాంధీ విగ్రహాల వద్ద వీఆర్ఏల మౌన దీక్ష
తమ సమస్యలు పరిష్కారం కోసం వీఆర్ఏలు చేస్తున్న సమ్మె గాంధీ జయంతి రోజుకి 70వ రోజుకు చేరుకుంటుంది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ కేంద్రాల్లో మౌనదీక్షలు చేపట్టాలని వీఆర్ఏ జేఏసీ పిలుపునిచ్చింది.
7.షర్మిల కామెంట్స్
ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
8.మెడికల్ కాలేజీ పై స్టే ఎత్తివేత
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణంపై ఉన్న స్టేను హైకోర్టు డివిజన్ గురించి ఎత్తివేసింది.
9.సుప్రీం లో రఘురామకు ఊరట
సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఊరట లభించింది.సిబిఐ కేసు విచారణ పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
10.దేవినేని ఉమ నిరసన దీక్ష
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును ప్రభుత్వం కుట్రపూరితంగా మార్చడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి టీడీపీ కీలక నేత దేవినేని ఉమ ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షను చేపట్టనున్నారు.
11.అమరావతి మహా పాదయాత్ర
అమరావతి ని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేడు ద్వారకాతిరుమల కు చేరుకుంది.ఈ సందర్భంగా చిన వెంకన్నను వీరంతా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
12.దుర్గమ్మను దర్శించుకున్న సిఎస్
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దర్శించుకున్నారు.
13.టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమలలో శ్రీ వారి గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు తిరుమల శ్రీవారిని గరుడ వాహన సేవను అధికారులు నిర్వహించనున్నారు.
14.మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఆరవ రోజుకి చేరుకున్నాయి.ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
15.శ్రీశైలంలో నీటి నిలువలపై ఫిర్యాదు
సాగు తాగునీటి అవసరాల కోసం కాకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం అంటూ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని కిందకి విడిచిపెట్టడం వల్ల ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోతున్నాయని కృష్ణ బోర్డు చైర్మన్ కు ఏపీ జల వనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు.
16.నియామకాలకు గరిష్ట వయోపరిమితి పొడగింపు
ఏపీపీఎస్సీ , ప్రభుత్వ సంస్థల ద్వారా చేపట్టే ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 34 నుంచి 42 ఏళ్లకు పొడగించింది.
15.గ్రూప్ వన్ పోస్టులకే ఇంటర్వ్యూలు
నియామకాల్లో ఇంటర్వ్యూలు కేవలం గ్రూప్ వన్ పోస్టులకు మాత్రమే ఉంటాయని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
17.గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్
గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.92 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
18.సిఐడి పై అయ్యన్న కామెంట్స్
ఏపీ సిఐడి అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కామెంట్ చేశారు.
19.కెసిఆర్ కామెంట్స్
దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
20.రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన
అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మొదలుకానుంది.