యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఈసారి కూడా అంతే స్థాయిలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.అయితే ఈ సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్న ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
దీంతో ఫ్యాన్స్ సైతం ఈ ప్రాజెక్ట్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో తెలియక తికమక పడుతున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.ఈ సినిమా అసలు ఉందో లేదో అనే డౌట్ పడే వారికీ ఈ అప్డేట్ తో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పకనే చెప్పారు.
డైరెక్టర్ కొరటాల, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇంకా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్న పిక్ ఒకటి నిర్మాణ సంస్థ షేర్ చేస్తూ ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందకుండా వారి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేలా చేసారు.దీంతో శరవేగంగా పనులన్నీ పూర్తి అవుతుండడంతో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఇక ఇంకా ఈ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.అలాగే ఇతర నటీనటుల గురించి కూడా తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాల్సిందే.ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.చూడాలి మరి ఈ నెలలో అయినా సెట్స్ మీదకు వెళుతుందో లేదో.







