భారీ వరదల కారణంగా గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి పునఃప్రారంభమైంది.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గండిపోశమ్మ ఆలయం వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే నాలుగు రోజుల కిందటే పర్యాటక శాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో గండిపోశమ్మ ఆలయం వద్ద ఉన్న రెండు పర్యాటక బోట్లలో పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు.
గోదావరి నదిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండల విహారయాత్ర పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.