ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగించే వ్యక్తులు అందరికీ ఉంటాడు.కొందరు ప్రతీకారాన్ని తరచుగా బయటపెడతారు, మరికొందరు దీన్ని చేయాలనే ఆలోచనకు దూరంగా ఉంటారు.
కాగా చైనాలో ఒక వ్యక్తి తన కుమార్తెను కొరికిన కారణంగా జీవించి ఉన్న పీతను తిన్నాడు.చివరికి, అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
అతడి ఛాతీ, ఉదరం, కాలేయం, జీర్ణవ్యవస్థలో వ్యాధి సోకింది.ఈ వ్యక్తి తూర్పు చైనాలోని జెజియాంగ్కు చెందిన 39 ఏళ్ల లూగా గుర్తించారు.
సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత మిస్టర్ లూ తీవ్రమైన వెన్నునొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వైద్యులకు చెప్పడంతో వారు ఇదేం వింత కేసు అని అవాక్కయ్యారు.
ఈ సంఘటన విన్న తరువాత, డాక్టర్ కావో, మీరు పీతను ఎందుకు తిన్నారు అని అడిగారు.తన కూతురిని పీత మన కోరలతో గట్టిగా గిచ్చిందని అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని దాన్ని బతికుండగానే కరకరా నమిలేసి తిన్నానని లూ అన్నాడు.
అప్పుడు వైద్యులు లూ రక్త నమూనాలను పరీక్ష కోసం పంపారు.అతనికి పీత తినడం వల్ల మూడు పరాన్నజీవులు సోకినట్లు కనుగొన్నారు.
లూ ఇప్పుడు కోలుకున్నాడు.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కానీ రెగ్యులర్ చెక్-అప్ల కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది.
ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.వామ్మో పీతని కూడా వదల్లేదంటే.
.తన కూతురిని ఎవరైనా ఏదైనా అంటే మర్డర్ చేస్తాడేమో అని కామెంట్లు చేస్తున్నారు.