కోట్లాది మందిని అత్యధికంగా వేధించే చర్మ సమస్యల్లో మచ్చలు, ముడతలు ముందు వరుసలో ఉంటాయి.ఇందులో ఎటువంటి సందేహం లేదు.
పైగా ఈ మచ్చలు, ముడతలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ క్రీమ్ ను గనుక వాడితే సులభంగా ఆయా సమస్యల నుంచి బయటపడొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మచ్చలు మరియు ముడతలను తరిమికొట్టే ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ ను పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఈ లోపు ఒక బంగాళదుంపను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించుకున్న అవిసె గింజలు, బియ్యాన్ని వేసుకోవాలి.
అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి వస్త్రం సహాయంతో క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ క్రీమ్ లో రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, రెండు చుక్కలు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ హోమ్ మేడ్ క్రీమ్ రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడితే చర్మంపై ఎంతటి మొండి మచ్చలైన మాయం అవుతాయి.
అలాగే ముడతలు దూరమై చర్మం యవ్వనంగా సైతం మారుతుంది.