బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని మంత్రి వ్యాఖ్యనించారు.అనంతరం ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు.రాజగోపాల్ రెడ్డి స్వార్థం, బీజేపీ దురుద్దేశం కారణంగానే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు.బీజేపీకి ఓటు వేస్తే గ్యాస్ ధర మరో రూ.100 పెరుగుతుందన్నారు.టీఆర్ఎస్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.







