జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ క్రమంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన భేటీ కానున్నారు.

జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు.తరా రోజు ప్రకటించే జాతీయ పార్టీ పై కెసిఆర్ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

పార్టీ ఏర్పాటు ఉద్దేశం, అజెండాలపై వివరించనున్నారు.అదేవిధంగా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు సలహాలు, సూచనలను కెసిఆర్ తీసుకోనున్నారు.

అంతేకాకుండా తొలి బహిరంగ సభ కరీంనగర్ లోనే నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కెసిఆర్ భావిస్తున్నారు.

Advertisement

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికపై కూడా నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు