అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి దూరమై వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.
మొన్నటి వరకు ఆంటీ అనే వివాదంపై పెద్ద ఎత్తున నేటిజెన్లపై మండిపడిన ఈమె ఏకంగా పోలీసులను కూడా ఆశ్రయించి తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన వారిపై కేసు పెట్టారు.
ఇలా తరచూ ఏదో ఒక వివాదంలో ఉండే అనసూయ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈమె తన భర్తతో కలిసి డిన్నర్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.అయితే తన భర్తతో రొమాంటిక్ డిన్నర్ లో పాల్గొన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి నేటిజన్ల ట్రోలింగ్ కు గురైంది.

ముఖ్యంగా అనసూయ ఈ ఫోటోలలో కాలేజ్ అమ్మాయిల అద్దాలు పెట్టి చిన్న స్కర్ట్ ధరించి చేతిలో పుస్తకం పట్టుకోవడంతో అసలు ఆ డ్రెస్ ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఈమె వస్త్రధారణ పై మండిపడుతున్నారు.ఇలా పొట్టి డ్రెస్ ధరించి థైస్ అందాలు చూపెట్టడంతో నేటిజన్స్ యధావిధిగా తన డ్రెస్ గురించి ఈమెను ట్రోల్ చేస్తున్నారు.అయితే ఇదివరకు ఎన్నో సార్లు అనసూయ వస్త్రధారణ పై ఇలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఐ డోంట్ కేర్ అంటూ ఈమె వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇలా అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







