లోన్ యాప్స్ ఆగడాలపై ఈడీ అధికారులు దూకుడు పెంచారు.దీనిలో భాగంగా 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలోని పలు కంపెనీల్లో సోదాలు చేపట్టారు.ఈ సోదాల్లో భారీగా నకిలీ బ్యాంక్ ఖాతాలను గుర్తించారు అధికారులు.
పేమెంట్ గేట్ వేల ద్వారా విదేశాలకు డబ్బులు బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో రూ.17 కోట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.







