మళ్లీ టీడీపీ నుండే క్లారిటీ ఇచ్చిన మాగంటి బాబు..!!

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మాగంటి బాబు ఇటీవల నూజివీడులో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వచ్చే ఎన్నికలలో ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ నుండే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

 Again Maganti Babu Gave Clarity From Tdp Eluru District , Tdp, Maganti Babu-TeluguStop.com

అభ్యర్థి తానే అని చెప్పుకొచ్చారు.ఈ విషయంలో చంద్రబాబు నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు.

ప్రతి ఒక్కరూ తన గెలుపునకు కృషి చేయాలని.తాను నియోజకవర్గానికి, జిల్లాకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి మాగంటి బాబు చాలా వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఇద్దరు కుమారులు మరణించడంతో మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాగంటి బాబు ఇప్పుడు తాజాగా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ.వచ్చే ఎన్నికలలో టీడీపీ ఎంపీగా తానే నిలబడుతున్నట్లు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 2014 ఎన్నికలలో ఏలూరు ఎంపీగా గెలిచిన మాగంటి బాబు తర్వాత 2019 ఎన్నికలలో ఓడిపోయారు.ఈ క్రమంలో మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎంపీగా తానే మళ్ళీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube